15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి

Published: Tuesday February 15, 2022
బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత
బెల్లంపల్లి ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని బెల్లంపల్లి మునిసిపల్ చైర్మన్ జక్కుల శ్వేత అన్నారు. సోమవారం నాడు నాలుగో వార్డు పరిధిలోని గోల్ బంగ్లా బస్తి ఏరియాలో వ్యాక్సిన్ చేస్తున్న సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత, వార్డ్ కౌన్సిలర్ షేక్ ఆస్మా యూసుఫ్, ఆర్ పి సుజాత, ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు, పలువురు తెరాస నాయకులు, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.