కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హత్ సే హత్ జోడో కార్యక్రమం

Published: Monday February 13, 2023

జన్నారం, ఫిబ్రవరి 12, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో  హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ హయాంలో జరిగిన మంచి పనుల  గురించి వివరించడం జరిగిందని మండల అధ్యక్షుడు బోర్లకుంట ప్రభుదాస్ అన్నారు. ఆదివారం పోన్కల్ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ చేసిన దానికి ప్రజలు కూడా సహకారం అందిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయే తప్ప, గత ఎన్ని సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎవరికి ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం గ్యాస్, పెట్రోల్,డీజిల్, విద్యుత్ చార్జీలు పెంచేసి బిజెపి, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.ఈ  కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ పసివుల్లా, సీనియర్ నాయకులు ముజ ఫర్ అలీ ఖాన్,  పట్టణ అధ్యక్షుడు దుమాల రమేష్, వార్డ్ మెంబర్ గంగన్న యాదవ్,  మండల మైనార్టీ అధ్యక్షుడు వాసిం పటేల్ , బీసీ సెల్ అధ్యక్షుడు బీనవేణి రాజన్న యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మామిడిపెళ్లి ఇందయ్యా, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బొంతల లక్ష్మణ్, యువజన కాంగ్రెస్ నాయకులు మంద రాజేష్, రోహిదాస్, తదితరులు పాల్గొన్నారు.