గంధం తనయుడు జన్మదిన సందర్భంగా దివ్యాoగులకు నిత్యావసర సరుకులు పంపిణీ
Published: Monday January 02, 2023
మేడిపల్లి, జనవరి1 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు తనయుడు గంధం సోహాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని పూనం భవన్ ఫంక్షన్ హాల్లో దివ్యాoగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ గంధం జోష్నా నాగేశ్వరరావు మాట్లాడుతు తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మీ ఆశీర్వాదములు ఎల్లవేళల తన కుమారినిపైన ఉండాలని కోరారు. మున్ముందు ఎటువంటి సహాయ,సహకారాలు కావాలన్నా తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దివ్యాoగులు రాఘవేంద్ర ,బిక్షపతి ,బాలకృష్ణ ,పద్మా ,జ్యొతి,శ్రీనివాస్,యదగిరి,శంకర్ ,ఉమా ,పద్మావతి ,ఫాతిమ,మంగా,సరిత ,శైలేజా,సుజాత ,శ్రవణ్ కుమార్ ,బెజ్జం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నాయకులు శ్రీమంత్ ,మనీష్ ,రవి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: