కోరుట్ల నియోజకవర్గ ఎస్సీ ,ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక .
Published: Monday April 03, 2023
కోరుట్ల, ఏప్రిల్ 02 (ప్రజాపాలన ప్రతినిధి):
ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ కోరుట్ల నియోజకవర్గ ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షుడు కట్కూరి మల్లేష్, జిల్లా అధ్యక్షుడు దాసం కిషన్, జనరల్ సెక్రెటరీ మల్యాల సతీష్ కుమార్, గౌరవ అధ్యక్షుడు బూరం సంజీవ్ ల ఆధ్వర్యంలో ఆదివారం రోజున కోరుట్ల పట్టణము లోని కావేరి గార్డెన్ నిర్వహించారు.ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా బలిజ సంతోష్ ( సూర్య దినపత్రిక), ప్రధాన కార్యదర్శిగా పింజారి శివకుమార్ ( ప్రజా జ్యోతి దినపత్రిక ) ఉపాధ్యక్షులుగా బొల్లం రాజు ( తెలంగాణ క్రాంతి దినపత్రిక ), ఎన్నం రాజశేఖర్ ( ప్రజా జ్యోతి దినపత్రిక ), సహాయ కార్యదర్శులుగా ఊడుగుల గంగాధర్ ( జనం సాక్షి దినపత్రిక ), అల్లం రాజేష్( మెట్రో ఈవినింగ్ దినపత్రిక ) కోశాధికారిగా ఇంద్రాల హరీష్ ( ప్రజాపాలన దినపత్రిక ), ఆర్గనైజింగ్ సెక్రటరీ తరి రాజశేఖర్ ( విజన్ ఆంధ్ర దినపత్రిక ), గౌరవ అధ్యక్షుడుగా గోరమంతల నారాయణ ( సూర్య దినపత్రిక ), గౌరవ సలహాదారుగా మిడిదొడ్డి మల్లేష్ ( మన తెలంగాణ దినపత్రిక ), కార్యవర్గ సభ్యులుగా గూడపాటి దుర్గాప్రసాద్, బాణాల శ్రీధర్, బాణావత్ శ్రీనివాస్ నాయక్, అజ్మీర గంగాధర్ నాయక్, ఇటిక్యాల నరేష్, సభావత్ మల్లేష్, చట్ పల్లి లక్ష్మణ్, పింజారి రజినీకాంత్, లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.
Share this on your social network: