వేణుగోపాలస్వామి పాలకవర్గంప్రమాణ స్వీకారం

Published: Saturday May 21, 2022
మధిర మే 20 ప్రజా పాలన ప్రతినిధి పరిధిలో శుక్రవారం నాడు చెరుకుమల్లి వారి వీధిలో వున్న శ్రీ వేణుగోపాలస్వామి గీతామందిరం దేవాలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈరోజు ఉదయం దేవాలయ ప్రాంగణములో జరిగినది. వర్తకసంఘం శ్రీ వేంకటేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షులు వేముల తిరుపతి రావు నూతన పాలకవర్గంతో ప్రమాణము చేయించారు. పాలకవర్గ అధ్యక్షులుగా కర్లపూడి వాసు, ప్రధాన కార్యదర్శిగా గొండేల సూర్యప్రకాశరావు, కోశాధికారిగా వేమూరి సునీల్ కుమార్, ఉపాధ్యక్షులుగా కోమటీడి శ్రీనివాసరావు, భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి, మహంకాళి రామకృష్ణ తిలక్, గోనుగుంట్ల వెంకట మాణిక్యాలరావు, గుర్రం శివప్రసాద్ సంయుక్త కార్యదర్శిగా గూడెల్లి సత్యనారాయణ గౌరవ సలహాదారులుగా వేముల ఆంజనేయులు, కపిలవాయి జగన్మోహన్ రావు, ముత్తవరపు వెంకటేశ్వరరావు మహిళా కార్యవర్గ సభ్యులుగా పెరుమాళ్ల దుర్గారాణి, ఈదర కళ్యాణి కార్యవర్గ సభ్యులుగా కళ్యాణపు సుబ్బారావు, బొగ్గవరపు గణేష్, జమ్ముల వెంకటరావు, వెంకట నారాయణ తదితరులు ప్రమాణం చేసారు. ఈ కార్యక్రమంలో ఇరుకుళ్ళ లక్ష్మీనరసింహారావు, పల్లపోతు ప్రసాదు, చెరుకుమల్లి విజయకుమార్, కుంచం కృష్ణారావు, ముత్తవరపు నాగేశ్వరరావు, డోగుపర్తి సత్యంబాబు, కాజా శ్రీనివాసరావు, పరాంకుశం శ్రీనివాసరావు, నేరెళ్ళ శ్రీనివాసరావు, చిట్టేల శేషు, చెరుకూరి కృష్ణారావు, పావులూరి వెంకట్, కొంగర యలమందరావు తదితరులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శీలం వెంటరెడ్డి రూ.50,116/- కోమటీడి శ్రీనివాసరావు 25,116/- స్విమ్మర్ చెరుకూరి కృష్ణారావు 5,116/- దేవాలయ పునర్ నిర్మాణానికి తమవంతు విరాళము ప్రకటించారు. తదనంతరము స్వామి వారి ప్రసాదం పులిహోర, చక్రపొంగలి దేవాలయ అర్చకులు శ్రీమాన్ రాయప్రోలు కృష్ణప్రసాద్  ఆధ్వర్యంలో వితరణ చేసారు