ఉన్నత చదువులపై ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Friday November 26, 2021
బెల్లంపల్లి నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి:  బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల  పాఠశాల/కళాశాలకు చెందిన నిరుపేద విద్యార్థులు డి.రంజిత్, యన్.సాయితేజ లు అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నీట్) వరంగల్ లో సీటు సాధించి అడ్మిషన్ల కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం నాడు ఆయన కూతురు విహారిక తో కలిసి గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ సైదులు ఆధ్వర్యంలో వారికి 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతి పుత్రులైన నియోజకవర్గంలోని ఏ పేద బిడ్డలైన ఉన్నత చదువులను డబ్బులు లేక ఆపుకోవద్దని ప్రతిష్ఠాత్మకమైన ఉన్నత విద్యాలయాల్లో సీటు సంపాదించుకున్న వారు తనను కలిస్తే వారి చదువుల కోసం తన శాయశక్తులా ఆర్థిక సహాయాన్ని అందించి పై చదువులు చదువుకోవడానికి సహాయ పడతానని ఎవరు కూడా చదువుకోవడానికి డబ్బులు లేవని వాళ్ల చదువులు మధ్యలోనే ఆపుకో కూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, తన కూతురు నిహారిక, కళాశాల ప్రిన్సిపాల్ సైదులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.