ప్రభుత్వ పాఠశాలను సందర్శిన జిల్లా సెక్టోరియల్ అధికారి కె.రాజేశ్
Published: Saturday February 04, 2023
కోరుట్ల, ఫిబ్రవరి 03 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మోహన్ రావుపేట ను జిల్లా సెక్టోరియల్ అధికారి కె.రాజేశ్ శుక్రవారం రోజున సందర్శించారు.ఈ పర్యవేక్షణలో ఎఫ్.ఎల్.ఎన్ కార్యక్రమం అమలు జరుగుతున్న తీరును, విద్యార్థుల ప్రగతిని,బడి బయటి విద్యార్థుల వివరాలను,స్వచ్ఛ పాఠశాల,శాలసిద్ధి, చైల్డ్ ఇన్ఫో లో విద్యార్థుల నమోదు, ఎఫ్.ఏ.1,
ఎఫ్.ఏ.2, ఎఫ్.ఏ.3, ఎస్.ఏ 1 రికార్డు లను పరిశీలించారు.జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నూతన పరీక్ష విధానంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఉపాద్యాయులు సెక్టోరియల్ అధికారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె.లలిత, మధుసూదన్ రావు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Share this on your social network: