తల్లాడ పంచాయతీలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు..

Published: Saturday July 02, 2022
పర్యవేక్షిస్తున్న సర్పంచ్ సంధ్యారాణి, ఈవో సీతారాములు..
 
తల్లాడ, జులై 1 (ప్రజా పాలన న్యూస్): 
 
 *తల్లాడ మేజర్ గ్రామపంచాయతీలో పారిశుధ్య పనులు వేగంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో ముమ్మరంగా పనులను చేపడుతున్నారు. గ్రామంలో ప్రోక్లైన్ ద్వారా సైడ్ కాలవలు, పూడికలు తీయిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ పనులను తల్లాడ మేజర్ పంచాయతీ సర్పంచ్ పొట్టేటి సంధ్యారాణి, పంచాయతీ ఈవో జీనుగు సీతారాములు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల రోజులు నుండి పారిశుద్ధ్య కొరలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందునా ఈ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటిని పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వార్డు మెంబరు గొడుగునూరి శ్రీనివాస రెడ్డి, పలువురు సిబ్బంది ఉన్నారు.*