స్వయం ఉపాధి పొందటం చాలా సంతోషం మధిర బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు వేమవరపు వెంకటేశ్వర శర్మ
Published: Tuesday March 07, 2023
మధిర ,మార్చి 6ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వారి ఆర్థిక సహాయంతో సబ్ రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో శ్రీ భీమవరపు రామారావు ఏర్పాటు చేసుకున్న శ్రీ సాయిరాం టీ స్టాల్ ను సోమవారం మదిర బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు శ్రీ వేమవరపు వెంకటేశ్వర శర్మ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అందించే వివిధ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందటం చాలా సంతోషమని, బ్రాహ్మణ పరిషత్ ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కి, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా లబ్ధిదారులకే లబ్ధి చేకూరా విధంగా పథకాలను రూపొందించిన పరిషత్ చైర్మన్ శ్రీ కె.వి.రమణాచారి కి ముఖ్యకారణర్వాహణాధికారి రఘురాం శర్మ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రామారావు వ్యాపారం అభివృద్ధి చెందాలని శర్మ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గడ్డమణుగు శ్రీనివాసరావు , అవధానాల లక్ష్మీ సుబ్రహ్మణ్య శాస్త్రి , గండూరి శ్రీనివాసరావు, మాదిరాజు దుర్గాప్రసాద్ , డివిఆర్ నాగేశ్వరరావు , గడ్డమణుగు రామభద్రం , గడ్డమణుగు సుప్రియ,జక్కేపల్లి మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: