టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి" : ఎంపీపీ అరిగెల మల్లికార్జున్
Published: Monday January 10, 2022
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జనవరి 09 (ప్రజాపాలన) : టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆసిఫాబాద్ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్ అన్నారు. ఆదివారం మండలంలోని వావుధం, బాబాపూర్, గ్రామాలలోని రైతు వేదికలో రైతుబంధు సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలు రైతుల కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఇలాంటి పథకాలు దేశంలోనే ఆదర్శప్రాయం అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ప్రజల కోసం మరిన్ని పతకాలు తీసుకు వస్తుందని తెలిపారు. సంబరాలలో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, పార్టీ అధ్యక్షులు గంధం శ్రీనివాస్, గోపాల్ నాయక్, సర్పంచులు లక్ష్మీ, బానోత్ పార్వతి, సావిత్రి, మల్లేష్, ఖాదర్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: