టిఆర్ఎస్ తోనే పంచాయతీలను అభివృద్ధి ..మండల సర్పంచుల సంఘం. మండల అధ్యక్షుడు జాడి గంగాధర్
Published: Tuesday October 11, 2022
జన్నారం, అక్టోబర్ 10, ప్రజాపాలన: టిఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలను అభివృద్ధి చేయుటలో ముందుందని మండల సర్పంచుల అధ్యక్షుడు జాడి గంగాధర్ అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ జాడి గంగాధర్ గ్రామ సభ నిర్వహించారు. గ్రామ ప్రజలు సకాలంలో పంచాయతీ పన్నులు చెల్లించి పంచాయతీ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి మరింత అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు. స్థానిక గ్రామ పంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు కార్యదర్శి ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: