కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

Published: Thursday December 15, 2022
జన్నారం, డిసెంబర్ 14, ప్రజాపాలన: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వేడ్మ బోజ్జు అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, పార్టీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు దాడి చేయడం సరైన నిర్ణయం కాదని దానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా దాడులను నిరసిస్తూ జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోర్లకుంట ప్రభుదాస్ అన్నారు. రాష్ట్రంలో రావుల పాలన పోలీస్ పాలన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దుమాల రమేష్, ప్రధాన కార్యదర్శి పసివుల్లా, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి షోహెల్ షా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మామిడిపల్లి ఇందయ్య, నాయకులు ముత్యం రాజన్న, ప్రశాంత్, గంగన్న, తదితరులు పాల్గొన్నారు.