నూతన కల్వరి చర్చిని ప్రారంభించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ సిస్టర్ షారోన్

Published: Friday November 26, 2021
బెల్లంపల్లి నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గంలోని సోమగూడెం సమీపంలో విదేశీ పరిజ్ఞానంతో అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన కల్వరి చర్చి ని చర్చి  పాస్టర్ ప్రవీణ్ కుమార్, సిస్టర్ షారోన్ లు బుధవారం నాడు సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్, దివాకర్ రావ్, బెల్లంపల్లి ఆర్ డి ఓ శ్యామలా దేవి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ జెడ్పిటిసి కార్కూరి రామచందర్, మరియు బెల్లంపల్లి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వివిధ చర్చిల పాస్టర్స్, విశ్వాసులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.