నాటిన మొక్కలను సంరక్షించాలి : బోగ శ్రావణి

Published: Saturday May 15, 2021
జగిత్యాల, మే 14 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని శుక్రవారం రోజున మాత శిశు కేంద్రం వద్ద మొక్కలకు నీరుపోసిన సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయినటువంటి హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని గ్రీన్ ఫ్రైడేను హరిత శుక్రవారంగా ఏర్పాటు చేసుకొని పట్టణంలో అన్ని వార్డుల్లో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలకు నీరు పోసి రక్షించాల్సిన బాధ్యత కౌన్సిలర్లు అధికారులు సిబ్బందిపై ఉన్నదని ఫ్రైడేను గ్రీన్ ఫ్రైడేగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతి ప్రసాద్ సానిటరి ఇన్స్పెక్టర్ అశోక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.