శంకరపట్నంలో ఆర్టీవో వాహనాల తనిఖీ శంకరపట్నం ఫిబ్రవరి 27 ప్రజాపాలన ప్రతినిధి:
Published: Tuesday February 28, 2023
శంకరపట్నం మండల కేంద్రంలో సోమవారం హుజురాబాద్ ఆర్టీవో వాహనాలను తనిఖీ నిర్వహించాడు. సరైన పత్రాలు లేని వాహనాలకు అపరాధ రుసుము (ఫైన్) వేశారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎండి సిరాజ్ ఉర్ రహమాన్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా వాహన టాక్స్లు సకాలంలో చెల్లించాలని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకొని తనిఖీ చేసినప్పుడు అధికారులకు సహకరించాలని, వేగ నియంత్రణ పాటించి, రోడ్డు భద్రత ప్రమాణాలు పాటిస్తు సురక్షిత ప్రయాణాలు చేయాలని వాహనదారులకు సూచించారు. ఆయన వెంట హోంగార్డ్ గుర్రం శ్రీకాంత్ ఉన్నారు.
Share this on your social network: