క్రీడా సామాగ్రిని ఉచితంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు అందజేత

Published: Saturday December 10, 2022
జన్నారం, డిసెంబర్ 09, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన కైరం కిషన్ గౌడ్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు, ఉచితంగా సుమారు 15 వేల రూపాయల విలువ గల క్రీడా సామాగ్రిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి ప్రభాకర్ కు శుక్రవారం పాఠశాల ఆవరణలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని దానిని పెంపొందించుటకు ప్రతిరోజు విద్యార్థి దశలో ఆటలు ఆడాలని, ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాస కోసం ఆటలు ముఖ్యమని తెలియజేశారు. ఈ సంవత్సరం పదవ తరగతి చదివే పదవ తరగతి విద్యార్థులకు జిపిఏ సాధిస్తే పదివేల రూపాయలు బహుమతిగా అందిస్తానని తెలియజేస్తూ, విద్యార్థులను సదువుపై దృష్టి పెట్టె విధంగా ప్రేరణ కలగజేశారు. విద్యతోపాటు ఆటలు పాటలు నేర్చుకోవాలని, ఆటలలో పట్టుదల ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు మురిమడుగుల రమేష్, ఏ రాజేందర్, బి సాగర్, ముల్కల తిరుపతి, ఉపాధ్యాయుల బృందం, తదితరులు పాల్గొన్నారు.