సంఘం లక్ష్మీబాయి పాఠశాలకు చార్జింగ్ మైక్ సెట్ విరాళం

Published: Thursday February 02, 2023
 బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ నవీన్
వికారాబాద్ బ్యూరో 1 ఫిబ్రవరి ప్రజా పాలన : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలకు చార్జింగ్ మైక్ సెట్ విరాళంగా అందజేశామని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ నవీన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిదాసు పల్లి పిఎసిఎస్ డైరెక్టర్ గొల్ల రాఘవేందర్ సూచన మేరకు చార్జింగ్ మైక్ సెట్ ను సంఘం లక్ష్మీబాయి గురుకుల పాఠశాలకు అందజేశామని వివరించారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు చెప్పే సూచనలను సరిగ్గా వినిపించేందుకు మైక్ సెట్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాల సూచనలను ప్రతి విద్యార్థికి చేరే విధంగా మైక్ సెట్ ఎంతగానో ఉపయోగంలోకి వస్తుందని చెప్పారు.