రహదారి చూపించండి.. పనులు ప్రారంభించుకోండి : బోనకల్లు రైతుల విన్నపం
Published: Friday August 06, 2021
బోనకల్లు, ఆగస్టు 05, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ నుండి ఆళ్ళపాడు వెళ్లే రహదారిలో రైల్వే బ్రిడ్జి వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణానికి పనులు ప్రారంభిస్తూడడంతో ప్రతినిత్యం ఆదే దారిలో వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తున్న రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నిర్మాణ పనులు మొదలు పెట్టకముందే ప్రత్యామ్నాయంగా వ్యవసాయ పనుల చేసుకోవడానికి రహదారిని చూపించి సంబంధిత రైల్వే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించుకోవాలని బోనకల్ ఎంపీటీసీ సభ్యుడు గుగులోతు రమేష్ ఆధ్వర్యంలో బోనకల్ గ్రామానికి చెందిన 20 మంది రైతులు బోనకల్ మండల తాసిల్దార్ రాధికా కు గురువారం వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన తాసిల్దార్ రాధిక సదరు రైల్వే కాంట్రాక్టర్ తో చర్చించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.
Share this on your social network: