మేము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం కానీ మా గూడు వదులుకో

Published: Friday July 29, 2022
పాలేరు జూలై 28 ప్రజా పాలన ప్రతినిధి
మా ఇళ్లు ను ముట్టకుంటే ఇక్కడ మిగిలేది మా శవాలే  ఇళ్ల ను కూల్చోద్దు అంటూ ఆర్డీవో కాళ్లు పట్టుకున్న బాధితులు.
ఆయా...మాకు నిలువ నీడ లేదు...ఉన్నది ఈ ఒక్క ఇళ్లు...వీటిని రోడ్డు కోసం మమ్మల్ని రోడ్డున పడేయకండి అంటూ ఖమ్మం ఆర్డీవో
 
రవీంద్రనాధ్ ను కాళ్లు పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండల కేంద్రంలో జరుగుతున్న రహదారి విస్తరణ లో బాగంగా చెరువు కట్ట వద్ద ఉన్న ఇళ్లు రహదారి నిర్మాణం కు అడ్డంగా ఉన్నాయని, వాటిని తొలిగించాలని, ఆర్అండ్ అధికారులు ప్రయత్నించారు. కాగా బాధితులు గత కొంత కాలంగా నిరహారదీక్షలు, ఆందోళనలు చేపట్టారు. వారు ఇళ్ల ను కూల్చకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాధ్, ఆర్అండ్ బీ ఈఈ శ్యామ్ ప్రసాద్, డీఈఈ చంద్రశేఖర్, ఏఈ దేవేందర్. తహశీల్దార్ దారా ప్రసాద్. సర్పంచ్ రాయపూడి నవీన్ లు