ఆలేరు లో 73 వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Friday January 28, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 26 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షి గా ఆలేరు లో ఘనతంత్ర దినోత్సవ వేడుకలు. ఘనతంత్ర దినోత్సవ సందర్భంగా ఆలేరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద యాదాద్రి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆద్వర్యంలో 73వ ఘనతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మాజీ శాసనసభ్యులు డాక్టర్. కడుదుల నగేశ్, నీలం వెంకటస్వామి వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులు యువకులు తదితరులు కరోనా నిబంధనలను పాటిస్తూ ఘనతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.