సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Tuesday July 13, 2021
మేడిపల్లి, జూలై 12 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ పిఎన్టి కాలనీలో స్థానిక కార్పొరేటర్ తూముకుంట్ల ప్రసన్న లక్ష్మీ శ్రీధర్ రెడ్డితో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ మున్సిపల్ జెనరల్ ఫండ్ అంచనా విలువ రూ 5.00లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లో రోడ్లను నిర్మించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ ఏఈ వినీల్ కుమార్, డివిజన్ కమిటీ సభ్యులు, నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.