తెరాస పార్టీ సభ్యత్వం తీసుకోండి - బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములుకండి

Published: Tuesday February 23, 2021
కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ 
 
శేరిలింగంపల్లి, ప్రజాపాలన : శేరిలింగంపల్లి పరిధిలో గల తారనగర్ లో సోమవారమ నాడు ఏర్పాటు చేసిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమానికి  స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస పార్టీ సభ్యత్వం తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకొని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మరింత బలాన్ని చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, తారనగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు జనార్దన్ గౌడ్,వార్డు మెంబర్ కవిత గోపి, సీనియర్ నాయకులు హాబీబ్ భాయ్, రామచందర్, పాండు ముదిరాజ్, వెంకటేష్, చిన్న, పవన్, రహీం, నర్సింగ్, విజయ్, నాగరాజు, జ్యోతి, కవిత, సునీత, గోపాల్ యాదవ్, కొయ్యడా లక్ష్మణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల ఆర్జీకే కాలనీ లో నూతన సి.సి రోడ్డు నిర్మాణం కోసం జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ పరిశీలించటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస శేరిలింగంపల్లి డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ, శశికళ, సుజాత, స్వరూప, బాలాజీ సింగ్, లింగమ్మ, శోభ, శాంతన్న, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.