మియాపూర్ బస్ డిపోలో బిజెపీ ప్రచారం

Published: Saturday March 13, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ బస్ డిపో ఆర్టీసీ ఉద్యోగులతో బీజేపీ నాయకులతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ కలసి బీజేపీ అభ్యర్థిని గెలిపించగలరని విజ్ఞప్తి చేశారు.దీనికి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగులను నట్టేట ముంచిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని తెలియజేశారు. ఇక నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వానికి ఇప్పటి ఒక ఆలోచన లేదని, లక్షల ఖాళీలు ఉన్నా ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రతి గ్రాడ్యుయేట్ లు బీజేపీ అభ్యర్థి రాంచెందర్ రావు గారికి ఓటు వేసి మద్దతు తెలిపి గెలిపించుకుందాం అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మణిక్ రావు, శ్రీధర్ రావు, వర ప్రసాద్, రవి గౌడ్, లక్ష్మణ్, రామకృష్ణ, విజేందర్, రఘు, అశోక్, శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.