సిరిపురం గ్రామంలో రైతుబంధు సంబరాలు

Published: Friday January 07, 2022

మధిర జనవరి 6 ప్రజా పాలన ప్రతినిధి : మధిర మండల పరిధిలోని సిరిపురం క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులు రైతుబంధు సంబరాలను రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు చావా వేణు ఆధ్వర్యంలో సర్పంచ్ కనక పూడి పెద్ద బుచ్చయ్య రైతు వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుబంధు సహాయం 50 వేల కోట్లు మైలురాయి నీ దాటటం ప్రతి రైతు ఆనందించాల్సిన విషయం అని అన్నారు. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతుల కోసం రైతు బంధు,రైతు బీమా వంటి బృహత్తరమైన కార్యక్రమాలను చేపట్టిన ఘనుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ వేమిరెడ్డి సైదిరెడ్డి, రైతు గ్రామ కన్వీనర్ వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ నండ్రు కుమారి, నియోజకవర్గం యువజన నాయకులు కూన నరేందర్ రెడ్డి, ఏఈఓ మౌనిక, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు