ముగ్గులు ఇంటికి పండుగ శోభను తెచ్చిపెడతాయి కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్

Published: Wednesday January 12, 2022
మేడిపల్లి, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి) : రంగు రంగుల ముగ్గులు ఇంటికి పండుగ శోభను తెచ్చిపెడతాయని  పీర్జాదిగూడ నగర పాలక సంస్థ 2వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్ పేర్కొన్నారు. డివిజన్లోని కాకతీయ నగర్ కాలనీలో కాకతీయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంత్రి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్ పాల్గొని ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు పంపిణీ చేశారు. ముగ్గుల పోటీల విజేతలు ప్రధమ బహుమతి ఉష, ద్వితీయ బహుమతి పద్మలత, తృతీయ బహుమతి రాజిడి నిర్మల. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయనగర్ కాలనీ అధ్యక్షులు పి బాలరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జోగిని జహంగీర్, మహిళ ఉపాధ్యక్షురాలు ఎస్ సురేఖ మహిళ సమన్వయకర్త ఈ భాగ్య లక్ష్మి, వార్డ్ ఇంచార్జ్ గోవింద్, నిర్వహణ కార్యదర్శి ఎన్ లక్ష్మీ కాలనీవాసులు మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, కైలాసం, శ్రీనివాస్ రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.