ఎస్బిఐ బ్యాంక్ లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఖాతా కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇన్సూరె

Published: Thursday October 27, 2022
చేవెళ్ల అక్టోబర్ 26(ప్రజాపాలన) :

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఊరెళ్ల  గ్రామ పంచాయతీ నందు గ్రామ సర్పంచ్ ఎండి జహంగీర్  అధ్యక్షతన శ్రీనిధి  సంస్థ వారు లింక్ బ్రాంచ్ SBI చేవెళ్ల బ్రాంచ్ వారు  ఇన్సూరెన్స్ ల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చేవెళ్ల SBI అసిస్టెంట్ మేనేజర్ రజిత మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు SBI బ్రాంచ్ లో ఖాతా కలిగి ఉండాలి అని 70 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ చేయించుకొవలి అన్నారు. ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత అందరికీ  అర్థం అయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమం లో గ్రామ కార్యదర్శి రాజశేఖర్,ఉపసర్పంచ్ సునిగంటి విట్టలయ్య,యాదమ్మ,శివయ్య,అంగన్వాడి కార్యకర్తలు ధనలక్ష్మి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.