ముగిసిన టిఆర్ఎస్ గ్రామ కమిటీలు

Published: Wednesday September 08, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 07, ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు గాను సభలు నిర్వహించి టిఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా జానకిపురం అధ్యక్షునిగా బొమ్మన బోయిన చంద్రం, ప్రధాన కార్యదర్శిగా గంగాధర భూపతి,బ్రాహ్మణపల్లి అధ్యక్షునిగా వంగల కృష్ణ ప్రధాన కార్యదర్శిగా చేపూరి వెంకట నారాయణ, మండల అధ్యక్షుడు బంధం శ్రీను ఆధ్వర్యంలో ఈ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు బంధం శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జున రావు, రైతుబంధు మండల కో ఆర్డినేటర్ వేమూరి ప్రసాద్, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, మండల నాయకులు కాకాని శ్రీనివాసరావు, గాదె నరోత్తం రెడ్డి, జానకిపురం గ్రామ సర్పంచు చిలక వెంకటేశ్వర్లు, బ్రాహ్మణపల్లి సర్పంచ్ జెర్రిపోతుల రవి, జానకిపురం రైతు బంధు కోఆర్డినేటర్ తోటకూర అనంతరామయ్య, బ్రాహ్మణపల్లి రైతుబంధు కోఆర్డినేటర్ జంగా హార్లప్ప, రామీ శెట్టి రవి, గాలి కోటయ్య, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.