జీఓ నం.59 దరఖాస్తుదారులకు శుభవార్త ప్రత్యేక డ్రైవ్ లో వెంటనే రిజిస్ట్రేషన్లు

Published: Friday February 10, 2023
ఉప్పల్ తహశీల్దారు కె.గౌతమ్ కుమార్
మేడిపల్లి, ఫిబ్రవరి 9 (ప్రజాపాలన ప్రతినిధి)
జీఓ నం.59 దరఖాస్తుదారులకు ఈ వారం రోజులు జరిగే ప్రత్యేక డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఉప్పల్ తహశీల్దారు కె.గౌతమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తహశీల్దార్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ
ఎవరైతే జీఓ నం.59 కింద భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారో వారు డబ్బులు చెల్లిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేయనున్నట్టుగా తెలిపారు.ప్రస్తుతం జీఓ నం.59 కు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్ నడుస్తుందన్నారు. ఈ డ్రైవ్ లో   దరఖాస్తుల పరిశీలన, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నడుస్తుందన్నారు.
ఉప్పల్ మండల పరిధిలో 221మంది లబ్ధిదారులకు డిమాండ్ నోటీసులు అందచేశామన్నారు. వీరిలో ఇప్పటికే 16 మంది డబ్బులు చెల్లించినట్టుగా తెలిపారు.ఈ ప్రత్యేక డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోవాలని గౌతమ్ కుమార్ దరఖాస్తు దారులకు సూచించారు.లబ్ధిదారులు  రామంతాపూర్, ఉప్పల్ లోని సర్వే ఆఫ్ ఇండియా,మౌలాలి హౌసింగ్ బోర్డు మరియు చైతన్య పురి లోని ప్రభుత్వ మీ సేవ కేంద్రాలలో మాత్రమే చలాన్లు తీసి తహశీల్దారు కార్యాలయంలో సమర్పించాల్సిందిగా కోరారు.