ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి : బుంగ సునిల్

Published: Friday April 09, 2021
వలిగొండ, ఏప్రిల్ 8, ప్రజాపాలన ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయక తీవ్ర నిరాశకు గురవుతున్న నిరుద్యోగులు ఆత్మహత్య యత్నాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవల కాలంలో బోడ సునీల్ నాయక్, ముచ్చర్ల మహేందర్ యాదవ్ ప్రాణాలు తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం అని ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ లు విడుదల చేసి నిరుద్యోగ సమస్యను తీర్చాలని అలాగే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి చెల్లించాలని వలిగొండ తెలంగాణ జన సమితి మండల అధ్యక్షుడు బుంగ సునిల్ తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అలాగే ప్రయివేట్ టీచర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగ ధరించాలబి సునిల్ కోరారు.