మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ

Published: Thursday March 09, 2023
మధిర, మార్చి 8 ప్రజా పాలన ప్రతినిధి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా తెలంగాణ ప్రభుత్వం నేడు రాష్ట్ర మొత్తం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగింది.
అందులో భాగముగా మధిర మున్సిపాలిటీ లోని 461 సంఘాలకు 2018-19 మరియు 2019-20 సంవత్సరాలకు సంబందించిన మూడు కోట్ల ఎనబై ఆరు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయల (3,86,45,528/-) వడ్డీ రాయితీని మహిళా సంఘాల లకు మంజూరీ చేయడం జరిగింది. ఈ సందర్భముగా చైర్ పర్సన్ కమీషనర్ , వార్డు కౌన్సిలర్ ల చేతుల మీదుగా చెక్ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ గారు, వార్డు కౌన్సిలర్ లు, మెప్మా టీఎంసీ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.