ఎన్.ఎం.ఎం.ఎస్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన జనార్ధన్
Published: Thursday June 16, 2022
బోనకల్, జూన్ 15 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2022లో జరిగిన ఎన్.ఎం.ఎం.ఎస్ జాతీయ ఉపకార వేతనం పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణులై నెలకు 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12000 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ పురస్కారమునకు అర్హత సాధించిన సురభి జనార్ధన్ ప్రస్తుతము ముష్టికుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్నాడు. జనార్ధన్ ఉత్తీర్ణత సాధించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు జనార్ధన్ కి అభినందనలు తెలిపారు.
Share this on your social network: