ఉర్దూ పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి
Published: Thursday July 08, 2021
మెట్ పల్లి, జూలై 07 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలకు నూతన భవనం మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు పట్టణానికి చెందిన టీఆరెస్ మైనార్టీ నాయకులు వినతి పత్రం అందించారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని, నూతన భవనానికి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, టిఆర్ఎస్ మైనారిటీ విభాగం పట్టణ అధ్యక్షుడు ఎండీ జావిద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ హాలిమ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: