బోడుప్పల్లో డ్రైనేజీ ఔట్లెట్ పనులను పూర్తి చేయాలని మంత్రి మల్లారెడ్డికి టీఆర్ఎస్ నాయకులు

Published: Friday December 02, 2022
మేడిపల్లి, డిసెంబర్ 1 (ప్రజాపాలన ప్రతినిధి)
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేేజీ ఔట్లెట్ పనులకు  త్వరతిగతిన పూర్తి చేయాలని కోరుతూ  చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్, బోడుప్పల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొత్త రవి గౌడ్ ఆధ్వర్యంలో 2వ డివిజన్ ప్రజలతో కలిసి మంత్రి చామకూర మల్లారెడ్డి నివాసంలో 
ఆయనకు విన్నవించారు. బోడుప్పల్ కార్పొరేషన్లోని ప్రజలు ముఖ్యంగా 2వ డివిజన్ ప్రజలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఔట్లెట్ లేక ఇబ్బందులు పడుతున్నారని మంత్రిమల్లారెడ్డికి కొత్త రవి గౌడ్ తెలిపారు.  సానుకూలంగా స్పందించిన మంత్రి మల్లారెడ్డి తొందరగా  డ్రైనేజీ ఔట్లెట్ సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చినట్లు రవి గౌడ్ తెలిపారు.