చలివేంద్రాన్నిఏర్పాటు చేసిన శీలం వెంకట రెడ్డి

Published: Monday March 29, 2021
మధిర, మార్చి 28, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం  కలకోట గ్రామం లో పాదచారులకు వాహనదారులకు కలకోట గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు వేసవి కాలం సందర్భంగా ప్రజల దాహార్తి తీర్చడానికి ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకులు శీలం వెంకట రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారుప్రారంభోత్సవంసందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ఇతర ప్రయాణికులు మార్గమధ్యంలో త్రాగునీరు లేక అవస్థలు పడుతున్న సందర్భంలో కలకోట గ్రామం లో రహదారి పక్కన ఏర్పాటుచేసిన చలివేంద్రం వాహనదారులకు ప్రయాణికులకు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఎంఉపయోగకరంగా ఉంటుందని ఇలాంటి మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్న యువకులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు ఇలాంటి చలివేంద్రాలు రహదారి పక్కన ఏర్పాటు చేయడంవల్ల వాహనదారులకు ప్రయాణికులకు ప్రజలకు దాహార్తిని తీర్చలోఉపయోగపడతాయని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న యువతను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తూ అభినందించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మధిర పట్టణ మాజీ వైయస్సార్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేవన్ బట్ల శ్రీనివాస శాస్త్రి న తారి రంజిత్ తదితర ప్రజలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు