కోవిడ్ 19 నివారణ నిబంధనలు గురించి అవగాహన సదస్సు

Published: Friday April 16, 2021

మధిర, ఏప్రిల్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర పోలీస్ శాఖ టౌన్ ఎస్ఐ ఉదయ్ కుమార్, రూరల్ ఎస్ఐ రమేష్ కుమార్  ఆధ్వర్యంలో రెడ్డి గార్డెన్స్ లో కరోనా అవగాహన దాని నియంత్రణ సదస్సును గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైరా ఏసిపి సత్యనారాయణ, మధిర సిఐ ఓ మురళి పాల్గొని కరోనా రెండో దశ విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన తో పాటు నియంత్రణ చర్యలను చేపట్టే నిర్మూలన - నిబంధనలు మాస్కుల ఆవశ్యకత అనే అంశంపై మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయితీ సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికార యంత్రాంగం తో మీడియా సమావేశం నిర్వహించారు.