విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం అభివృద్ధికి కృషి చేస్తాం రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులు ముగ్గురికి

Published: Wednesday June 02, 2021

ఆసిఫాబాద్ జిల్లా, జూన్ 01, (ప్రజా పాలన, ప్రతినిధి) : విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంగం రాష్ట్ర కమిటీలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసులకు చోటు లభించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు బిక్షపతి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఇందులో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గాడి పెళ్లి గోవర్ధన చారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, శ్రీమంతుల వేణుగోపాల్ చారి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, తంగళ్ళపల్లి చంద్రశేఖర్ చారి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, నియమించారు. ఈ మేరకు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, భాస్కరాచారి, బట్టు పెళ్లి అశోక్ చారి, మండల అధ్యక్షుడు రాధాకృష్ణ చారి, కోశాధికారి తూమోజు సురేష్ చారి, లు తదితరులు అభినందించారు.