నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న దేవాలయం భూమి పూజ
Published: Tuesday June 01, 2021
పటాన్చేరు, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్ చేరు మండల పరిధిలోని బచ్చుగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్లన్న స్వామి దేవాలయ భూమి పూజలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, నూతన ఆలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి రాంచందర్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, నగేష్ యాదవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: