నూతనంగా నిర్మిస్తున్న మల్లన్న దేవాలయం భూమి పూజ

Published: Tuesday June 01, 2021

పటాన్చేరు, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్ చేరు మండల పరిధిలోని బచ్చుగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్లన్న స్వామి దేవాలయ భూమి పూజలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, నూతన ఆలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుమతి రాంచందర్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, నగేష్ యాదవ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.