అల్ ఇండియా హాకీ టోర్నమెంట్ కు డా.పద్మజ సంతాన సాఫల్య కేంద్రం ఆర్థిక సహాయం

Published: Tuesday November 09, 2021
యాదాద్రి జిల్లా నవంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి : నవంబర్ నెల 9 నుంచి 15వ తేదీ  వరకు 5వ యస్.ఎన్.బి.సి. అల్- ఇండియా హాకీ టోర్నమెంట్, పూణే, మహారాష్ట్ర లో జరుగు హాకీ టొర్నమెంట్ కు ఖాద్రీ నేతృత్వంలో యాదాద్రి భువనగిరి హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆల్ ఇండియా టొర్నమెంట్ హాకీ జట్టుకు సహృదయంతో ఆర్థిక సహాయం అందజేసిన వారిలో అగ్రభాగాన డాక్టర్.పద్మజ సంతాన సాఫల్య కేంద్రం, హబ్సిగూడ, హైదరాబాద్ వారు నిలిచారు. పలువురి ఆర్థిక సహాయముతో ఆదివారం నాడు హైదరాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్ నుండి బయలుదేరిన హాకీ జట్టు విద్యార్థులకు వీడ్కోలు పలికేందుకు వచ్చిన భువనగిరి వాస్తవ్యులు గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి తదితరులు.