ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 5 ప్రజాపాలన ప్రతినిధి **బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి*

Published: Thursday April 06, 2023

బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి సందర్భంగా, ఇబ్రహీంపట్నం లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద  ఉదయం 11గంటలకు బి ఆర్ ఎస్ పార్టీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మాజీ ఉప ప్రధాని, గొప్ప సంఘ సంస్కర్త, రాజ్యాంగం నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు తోడుగా ఉన్న వ్యక్తిఅని ,అలాంటి మహనీయులని మరవరాదని,  వారి ఆశయ సాధనకై   ప్రతి ఒక్కరూ ముందుండాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత సమాజ సేవా కార్యక్రమాలలో ముందుండి దేశ భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి), పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్,  ఎంపీపీ కృపేష్, పిఎసిఎస్ చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ క్యామమశంకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, బిఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల్ వెంకటరెడ్డి ప్రధాన కార్యదర్శి మడుగు వేణుగోపాల్ రావు, కౌన్సిలర్లు కసరమోని పద్మ, నల్లబోలు మమత శ్రీనివాస్ రెడ్డి,  యువజన విభాగం జెర్కొనిరాజు, విద్యా విభాగం నిట్టు జగదీశ్వర్, బంటి యూత్ ఫోర్స్  తదితరులు పాల్గొన్నారు.