పెద్ద గోపవరం లోవరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.
Published: Tuesday November 29, 2022
ఎర్రుపాలెం నవంబర్ 28 ప్రజా పాలన ప్రతినిధి ఎర్రుపాలెం మండల పరిధిలోని పెద్ద గోపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు సొసైటీ అధ్యక్షుడు శీలం అక్కిరెడ్డి సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, ఏఈఓ అర్చన, వైస్ ఇశ్రాయేలు, సొసైటీ డైరెక్టర్లు వేమిరెడ్డి వెంకటరెడ్డి, శీలం పుల్లారెడ్డి, తల్లపురెడ్డి రామిరెడ్డి, సీఈవో వీరారెడ్డి, రైతులు ఎదురు కృష్ణారెడ్డి, యన్నం సుధాకర్ రెడ్డి, వెంకటనారాయణ రెడ్డి, సత్యనారాయణ, శీలం కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది ప్రసాదు, సాంబయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: