ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Thursday April 28, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కార్పొరేటర్ యుగంధర్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్లోని బుద్ధ నగర్లో డివిజన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కొనియాడారు. కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.