అందుబాటులో యాసంగి విత్తనాలు

Published: Tuesday December 20, 2022
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్
వికారాబాద్ బ్యూరో 19 డిసెంబర్ ప్రజాపాలన : యాసంగి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 
నాణ్యమైన అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు అన్ని మండలాలో గల PACS, ARSKW, DCMS, MGC లలో అందుబాటులో  వుంచినట్లు తెలిపారు.  వికారాబాద్ జిల్లాలో వరిలో రకములు MTU1010, KNM118, J4L24423, RNR15048 25kgలో సంచి 850/- రూ॥ మరియు శనగ విత్తనములు JG11- 25 kg సంచి 1575/-, వేరుశనగ కదిరి లేపాక్షి & K6 25kg 2260/- రూ॥ పెసర్లు MGG 295 రకము 2Kg 209.40/-రూ॥ మినుములు PO-31 రకము 2kg 204.50 రూ|| కందులు 1CPL87119 & PRG 176 2kg 27200.60/- ర॥, నువ్వులు శ్వేత 2KG 300/- రూ, పొద్దు తిరుగుడు పుత్యు రకములు KBSH 41&44 2kg 1360-రూ॥ మొక్కజొన్న విత్తనాలు DHM117 రకము 5kg 575/-రూ॥ రాగి రుకం VL376 2kg 107.60 రూ|| లు చెల్లించి రైతులు కొనుగోలు చేయాలని తెలిపారు.