మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జవహర్ నెహ్రూ జయంతి వేడుకలు

Published: Tuesday November 15, 2022
ఎర్రిపాలెం 14ప్రజాపాలన ప్రతినిధి మండల  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెడ్డిపాలెం గ్రామంలో ఘనంగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం పురస్కరించుకొని నెహ్రూ  విగ్రహాన్ని కి ..*ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి  పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూభారతదేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. చిన్నపిల్లలు అంటే అమితమైన ప్రేమ జవహర్ లాల్ నెహ్రూ గారికి ఉంది కనుక ఆయన జయంతిని బాలల దినోత్సవం గా జరుపుకోవడం విశేషం.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నెహ్రూ 1923 సెప్టెంబర్లో ఎన్నికయ్యారు.  బెల్జియంలో జరిగిన ” అణ‌గారిన‌ జాతుల మహాసభలకు” భారత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా హాజరయ్యారు.1929లో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో నెహ్రూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం సొసైటీ వైస్ చైర్మన్ కడియం శ్రీనివాసరావు మధిర నియెజవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంచర్ల వెంకటనర్సయ్య షేక్ శభాష్ గూడేటి బాబురావు నండ్రు జనార్దన్ నరేష్ పాముల లక్ష్మణ్ దేవరకొండ కొండ మొదలగు వారు పాల్గొన్నారు...