బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మహిళ మహిళా న్యాయ దినోత్సవం
Published: Wednesday March 09, 2022
మధిర మార్చి 8 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మధిర బంజారా కాలనీ లోని పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో మహిళా న్యాయ చైతన్య సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మధిర కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీ డీ.ధీరజ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు తమకు ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లాలని, మహిళలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు చట్టంలో సరైన రక్షణలు ఉన్నాయని, చట్టాన్ని అందరూ ఉపయోగించుకొని మహిళలు తమ రంగాల్లో రాణించాలని ఉద్ఘాటించారు. అదే విధంగా ఈ సందర్భంగా మహిళా రక్షణాధికారులు ప్రియాంక, భావన లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఓ.మురళి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు భైరవభట్ల శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాది వాసంశెట్టి కోటేశ్వరరావు, మధిర పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, ఎస్సైలు ప్రియాంక, భావన, శ్రీనిధి కాలేజీ యాజమాన్యం అంజన బాబు, అనిల్, పారా వాలంటీర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: