పట్టణ ప్రగతిలో పాల్గొన్న కార్పొరేటర్

Published: Tuesday June 07, 2022
శ్రీవాణి వెంకట్రావు అధికారులు
మేడిపల్లి, జూన్ 6 (ప్రజాపాలన ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రామంతాపూర్ డివిజన్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్, జలమండలి, విద్యుత్ అధికారులతో  కలిసి స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లోని ఇందిరా నగర్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ కు ప్రజలు విన్నవించుకున్న సమస్యలు డ్రైనేజ్,  మంచినీళ్లు, విద్యుత్, రోడ్ల వంటి సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని కార్పొరేటర్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు నోడల్ ఆఫీసర్ వెంకటరమణ, ఏ ఈ జ్యోతి, మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఏ ఈ రాములు, జలమండలి సూపర్వైజర్ కిషన్ వారితో పాటు బిజెపి నాయకులు రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్ రావు, ముత్తినేని జగదీష్, తాళ్ల బాల కృష్ణ, సంకూరీ  కుమార స్వామి , ఇందిరానగర్ యూత్ క్లబ్ అసోసియేష సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 
 
 
 
Attachments area