కళ్లెం పెంటా రెడ్డికి ఘనంగా నివాళులర్పించి న ప్రముఖులు

Published: Friday July 01, 2022

ఇబ్రహీంపట్నం శ్రీ సాయి రామ్ వెంచర్ లో కళ్లెం పెంటా రెడ్డి దశదినకర్మ ప్రధమ వర్ధంతి నిర్వహించడం జరిగింది పెంటా రెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రముఖులు మాట్లాడుతూ ఎనలేని సేవలు అందించిన గొప్ప మహానుభావుడని తనదైన శైలిలో ప్రజలకు చే యుతనందించిన గొప్ప వ్యక్తి ఆయన తెలిపారు.  ఆయన చూపిన మార్గంలో  ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నామని వారు తెలిపారు. ఆయన  వర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ పట్వారి శ్రీ రామ్ రెడ్డి, ప్రధమ పుత్రుడు కళ్లెం జీవన్ రెడ్డి, ద్వితీయ పుత్రుడు కళ్లెం జయవర్ధన్ రెడ్డి, నందికొండ రవీందర్ రెడ్డి, సీమ మల్లేష్, మాజీ సర్పంచ్ గుండ్ల దానయ్య గౌడ్, డేరంగుల నరసింహ, చెరుకూరి గిరి, చెరుకూరి రవీందర్, చెరుకూరి మల్లేష్, గుండ్ల బాలేష్ గౌడ్, పల్చo లక్ష్మణ్ గౌడ్, చెరుకూరి చిన్న యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.