నిఘా నేత్రాలు నేరాలను అరికట్టేందుకు దోహదం

Published: Monday July 12, 2021
మేడిపల్లి, జూలై 11 (ప్రజాపాలన ప్రతినిధి) : నిఘా నేత్రాలు నేరాలను అరికట్టేందుకు దోహదపడతాయని కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ రాయాంచ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ హాజరై స్థానిక కార్పొరేటర్ కోల్తూరి మహేష్ తో కలిసి సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డివిజన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు కార్పొరేటర్ మహేష్ ను, కాలనీవాసులు మంత్రి మల్లారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కౌడే పోచయ్య, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు దర్గా దయాకర్ రెడ్డి, నాయకులు కుర్ర శ్రీకాంత్ గౌడ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.