వలిగొండ మండలంలో 11 మందికి కరోనా పాజిటివ్

Published: Friday April 16, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వలిగొండ, వేములకొండ, వర్కట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో గురువారం 38 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 11 మందికి పాజిటివ్ నిర్దారణ అయిందని, వారిని హోమ్ క్వారెంటైన్ చేశామని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. మండల వ్యాప్తంగా వలిగొండ, అరూర్, సుంకిషాల, సంగెం, వేములకొండ, వెంకటాపురం, నర్సయ్యగూడెం, నర్సాపురం, గురునాద్ పెళ్లి, కెర్చిపళ్లి, వెల్వర్తి, గోల్నేపళ్లి, జాలుకాల్వ గ్రామాలలో మొబైల్ క్యాంపుల ద్వారా కరోనా నివారణకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారని 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పక కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు కిరణ్ కుమార్ తెలిపారు.