మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటి ఈడి దాడులను ఖండించిన జవహర్ నగర్ తెరాస పార్టీ శ్రేణులు
జవహర్ నగర్ (ప్రజాపాలన ప్రతినిథి) : మంత్రి మల్లారెడ్డి పై జరుగుతున్నటువంటి ఐటీ దాడులను ఖండిస్తూ జవహర్ నగర్ లోని తెరాస పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు బాలాజీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మోడీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ అనే నినాదాలతో నిరసన తెలియజేశారు. మంత్రి మల్లారెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక బిజెపి కేంద్ర ప్రభుత్వం ఐటి దాడుల పేర్లతో భయపెట్టాలని ప్రయత్నిస్తుందని వారి బెదిరింపులకు తెలంగాణ సమాజం భయపడదని తెలుపుతు మునుగోడు ఎలక్షన్లలో ఓడినందుకు కక్ష కట్టి తెరాస పార్టీ మంత్రుల మీద ఐటి దాడులను నిర్వహిస్తున్నటువంటి బిజెపి పార్టీని దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలా పై దాడికి పంపడం రాజకీయం అనిపించుకోదు అని మండిపడ్డారు. మంగళవారం మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటి, ఈడీ దాడులకు నిరసనగా జవహర్ నగర్ లో టిఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం ఆవరణలో పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు బిజెపి ప్రభుత్వం మతాల పేరుతో కులం మద్య చిచ్చు పెడుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పండిన భయపడేది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, తెరాస పార్టీ ప్రెసిడెంట్ కొండల్ ముదిరాజ్, కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Share this on your social network: