గుట్ట బడి పాఠశాల లో ఘనం గా సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ

Published: Thursday December 09, 2021
ప్రజాపాలన ప్రతినిధి వైరా : వైరా మండలం వైరా పట్టణంలోని కేంద్ర ప్రాధమిక పాఠశాల గుట్టబడి లో ఉదయం 9 గంటలకు వేదమంత్రోచ్చరణల మధ్య వైరా శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ గారిచే ఘనంగా చదువుల తల్లి సరస్వతీ దేవి ప్రతిష్ట, ఆవిష్కరణ జరిగాయి,వైరా కు చెందిన, ఈ పాఠశాల పూర్వ విద్యార్థి నాయుడు సత్యనారాయణ, విజయ దంపతుల కుమారుడు వరుణ్ ఈ విగ్రహాన్ని వితరణ చేశారు, పాఠశాల నిర్వహణా కమిటీ అధ్యక్షులు గుదిమళ్ళ నాగేశ్వర రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగబత్తిని భాస్కరరావుల ఆధ్వర్యంలో జరిగి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైరా మండల విద్యా శాఖాధికారి శ్రీ కొత్తపల్లి వెంకటేశ్వర్లు విచ్చేసారు, వైరా ఆర్యవైశ్య సంఘ భాద్యులు ఎండ్రపూడి శంకర్, మిట్టపల్లి కిరణ్, వనమా కల్యాణ్, దోసపాటి కల్యాణ్, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, పాఠశాల ఉపాధ్యాయుల పాలకుర్తి జాన్, గృహాలక్ష్మి, పద్మజ, శ్రీనివాసాచారి, అనసూర్య, సైదమ్మ, ఉపాధ్యాయ సంఘ నేతలు, జివి సూర్యప్రకాష్ రావు, దొడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.